జోగిపేటలో బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభలో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర ప్రసంగించారు. కెసిఆర్ పతనానికి నాంది హుజురాబాద్ నుంచే అని ఆయన స్పష్టం చేసారు. కేసీఆర్, నోట్ల కట్టలు, మందు సీసాలు నా గెలుపును ఆపలేవు అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. యుద్దం మొదలైంది అన్నారు ఆయన. ప్రగతి భవన్‌లో కూర్చుని నా గొంతు పిసికేందుకు కుట్రలు చేస్తున్నారు అని ఆరోపించారు.

ఉద్యమంలో నా సహచరుడు హరీష్ రావు కుట్రలు అమలు చేస్తున్నాడు అని విమర్శించారు. దమ్ముంటే కెసిఆర్, హరీష్‌రావులే నా మీద పోటీకి రావాలి అని సవాల్ చేసారు. నేను ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని స్పష్టం చేసారు. ఇక్కడ విమర్శలు, ఢిల్లీలో వంగి వంగి దండాలు పెడుతున్నారు కేసీఆర్ అని ఈటెల రాజేంద్ర ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp