బాలీవుడ్ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్లను కోల్పోయిన చిత్రసీమకు మరో షాక్ త గిలింది. ప్రముఖ నిర్మాత, టెలివిజన్ అండ్ సినిమా ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్ మక్కర్ (60) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుల్మీత్ తుదిశ్వాస విడిచారు.
లాక్డౌన్ విధించకముందే ఇంట్లోనే గుండెపోటుకు గురైన కుల్మీత్ అప్పటినుంచి ధర్మశాలలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భం గా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల తమ నివాళి ప్రకటించారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్, ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్, దర్శకులు హన్సల్ మెహతా, సుభాష్ గాయ్ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
బాలీవుడ్ నటి విద్యాబాలన్ స్పందిస్తూ.. ' ఇది నిజంగా షాకింగ్.. ఇండస్ట్రీకి మీరు అందించిన సేవలు ఎప్పటికి గుర్తుంచుకుంటాం. మా కన్నీటితో ఇవే మీకు మా ఘన నివాళులు. నా తరపున మీ కుటుంబసభ్యులకు ప్రగాడ సానభూతి తెలియజేస్తున్నా' అంటూ పేర్కొన్నారు.