టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మరో సారి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విశాఖలో హుదూద్ తుఫాన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు హుదూద్ రిలీఫ్ ఫండ్ పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లు,.. పారిశ్రామికవేత్తల నుంచి అప్పట్లో ఏకంగా రూ. 100 కోట్ల వరకు ఎన్టీఆర్ ట్రస్టులోకి లాగారన్నారు. అయితే తుఫాన్ బాధితుల కోసం అంటూ సేకరించిన ఈ మొత్తం బాధితులకు పంచకుండా పెదబాబు, చినబాబు నొక్కేశారని విజయసాయి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఓ నిజాన్ని తెలుసుకోవాలని.. త్యాగాలు మీవి.. భోగాలు వారివి .. నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబుకు పావులుగా ఉపయోగపడిన వారంతా కళ్లు తెరవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారు. మద్య నిషేధాన్ని వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ ట్రస్టును లాక్కున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్నారు. చివరకు తుఫాన్ బాధితుల మొత్తం కూడా నొక్కేశారు. ఏ లోకంలో ఉన్నారో గాని ఎన్టీఆర్ గారు.. మీ అల్లుడి అరాచకాల కొరడా తీయండి అంటూ విజయసాయి విరుచుకు పడ్డారు.
తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి. త్యాగాలు మీవి...భోగాలు వారివి! నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబుకు పావులుగా ఉపయోగపడిన నాయకులూ, కార్యకర్తలూ నిలదీయండి. మీరిచ్చిన విరాళాలు ఎటు పోయాయని అడగండి.
— Vijayasai reddy v (@VSReddy_MP) May 6, 2020
ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారు. మద్య నిషేధాన్ని వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ ట్రస్టును లాక్కున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్నారు. తుఫాను బాధితులకు అంటూ కలెక్షన్లులాగి కోట్లు మింగేశారు... ఏ లోకంలో ఉన్నారోగానీ, ఎన్టీఆర్గారూ... మీ అల్లుడి అరాచకాల మీద ఇక కొరడా తీయండి!
— Vijayasai reddy v (@VSReddy_MP) May 6, 2020— Vijayasai reddy v (@VSReddy_MP) May 6, 2020రెండు నాలుకల్లో ఏది,ఎప్పుడు,ఏలైన్ తీసుకుంటుందో ఊహించడం కష్టం. కష్టజీవులకు ఉపశమనం లేకుండా మద్య నియంత్రణ ఏంటి?షాపులెలా తగ్గిస్తారని నిన్నటికి నిన్న కిందపడి దొర్లాడు.సైకిల్ నేతలను దెబ్బకొట్టడానికే ఇదంతా అన్నాడు. ఇప్పుడు కేంద్రం నిర్ణయానికి రాష్ట్రాన్ని నిందిస్తున్నాడు.మనిషి మారడంతే!
— Vijayasai reddy v (@VSReddy_MP) May 5, 2020