తెలంగాణాలో ఆర్టీసి బస్సులను రేపటి నుంచి నడుస్తాయని తెలంగాణా సిఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ లో సిటీ బస్ సర్వీసులు నడిచేది లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే అనుమతిస్తున్నామని, తెలంగాణా సరిహద్దులు దాటి ఎవరూ బస్సులు నడపవద్దు అని ఆయన పేర్కొన్నారు. 

 

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి బస్సులు నడుస్తాయని ఆయన స్పష్టం చేసారు. రాష్ట్రాల మధ్య ప్రజా రవాణా ఉండదు అని ఆయన స్పష్టం చేసారు. ఆర్టీసి బస్సులు కూడా కోవిడ్ నిభంధనలు పాటిస్తూ నడిపిస్తారు అని ప్రతీ రోజు శానిటేషన్ తర్వాతే బస్సులు నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. నిబంధలు కచ్చితంగా పాటిస్తూ బస్సులు నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆటో లు కాబ్ లకు అనుమతి ఇస్తున్నామని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: