దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం ఏ మాత్రం కూడా ఆగడం లేదు. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం కనపడటం లేదు. గత నాలుగు రోజుల నుంచి రోజు 5 వేల కు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న కూడా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. 5,553 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 132 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

 

ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 112,028 కి చేరుకుంది. 3,434 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 45,422 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇక ఇదే స్థాయిలో కేసులు పెరిగితే రెండు లక్షలు చేరడానికి మరో 15 రోజులు మాత్రమే పడుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: