గత ప్రభుత్వాలపై తెలంగాణా పశు సంవర్ధక శాఖా మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించాయని ఆయన ఆరోపణలు చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం మత్స్య కారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. 

 

చేపలు విక్రయించుకోవడానికి సబ్సిడీలపై వాహనాలు, వృత్తికి అవసరమైన వలలు, కిట్స్‌ తదితర పరికరాలను మత్స్య కారులకు అందించిన ఘనత సిఎం కేసీఆర్‌కే దక్కుతుందని తలసాని అన్నారు. రాష్ట్రంలో నీటి వనరులున్న ప్రతి చోటా చేప పిల్లలు వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలో మంచి చేపలను అందించడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: