వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఒక్కో స్కామ్ బయటికొస్తోందని అన్నారు. అవినీతిని పాల్పడ్డ వారెవరినీ వదలమని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అన్ని స్కీంలను స్కాములుగా మార్చారని అన్నారు. టీడిపీ అవినీతి పరుల జాబితా చాలా ఉందని అన్నారు. పార్టీ మునిగిపోతుందన్న ఆందోళనలో టీడీపీ నేతలు ఉందని అన్నారు. 
 
ఈరోజు మీడియాతో మాట్లాడుతూ చట్టాలు అందరికీ సమానమేనని వ్యాఖ్యలు చేశారు. అవినీతి నేతలను అరెస్ట్ చేస్తే బీసీ కార్డ్ వేస్తారా...? అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం బయటపడుతోందని చెప్పారు. కార్మికుల సొమ్ములు మింగేసింది ఒకరు... అక్రమ బస్సులతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది మరొకరు అంటూ అరెస్ట్ అయిన టీడీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కు కనీస జ్ఞానం లేదని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: