రాష్ట్రంలో కొత్తగా 1590 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 23,902కు చేరింది. ఆదివారం కొవిడ్తో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 295కు పెరిగింది. కరోనా నుంచి కోలుకుని 1166 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 12,703 మంది డిశ్చార్జయ్యారు.
ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 10,904 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలో 1277 కరోనా కేసులు నమోదు కాగా మేడ్చల్ జిల్లాలో 125, రంగారెడ్డి 82,సూర్యాపేట 23, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో 19 చొప్పున కేసులొచ్చాయి. నల్గొండ జిల్లాలో 14, వనపర్తి, కరీంనగర్ జిల్లాల్లో 4 చొప్పున, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 3 చొప్పున, నిర్మల్, వికారాబాద్, భద్రాద్రి, జనగాం జిల్లాల్లో 2 చొప్పున, గద్వాల్, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ గ్రామీణం,నారాయణపేట్, పెద్దపల్లి, యాదాద్రి, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయింది.