బంగాల్​లో నవరాత్రుల పూజల ప్రారంభం సందర్భంగా వర్చువల్​గా నిర్వహిస్తోన్న 'పూజోర్​ శుబికా' కార్యక్రమంలో పాల్గొని... ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధానమత్రి నరేంద్ర మోదీ. దుర్గాపూజ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని.. ముందుగా రాష్ట్ర ప్రజలకు బెంగాళీలో శుభాకాంక్షలు తెలిపారు మోదీ. దుర్గా పూజలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు మోదీ.మహిళలు.. మహాదుర్గ అమ్మవారికి ప్రతిరూపాలు అని పేర్కొన్నారు మోదీ.



 వివిధ పథకాలు, విధానాలతో మహిళల సాధికారత కోసం నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలోని మొత్తం 294 నియోజకవర్గాల్లోని 78 వేల పోలింగ్​ బూత్​ల్లో మోదీ ప్రసంగాన్ని ప్రసారం చేశారు. కరోనా నేపథ్యంలో ఒక్కో బూత్​లో 25 మందికిపైగా కార్యకర్తలు, ఓటర్లు వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టారు. మోదీ ప్రసంగం ప్రారంభానికి ముందు పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: