నటి  పాయల్ ఘోష్ సోమవారం కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేకి చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) లో చేరారు. పార్టీ చీఫ్ రామ్‌దాస్ అథవాలే సమక్షంలో పాయల్ ఘోష్ పార్టీలో చేరారు. ఆ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా పాయల్ ఘోష్ ఎంపికయ్యారు. పార్టీలోకి ఆమెను స్వాగతించిన రామ్‌దాస్ అథవాలే, "పార్టీలో చేరినందుకు ఆమెకు కృతజ్ఞతలు మరియు నేను ఆమెను స్వాగతిస్తున్నాను" అని అన్నారు.

ఇటీవల ఆమె తనను బాలీవుడ్ ప్రముఖులు అనురాగ్ కశ్యప్ రేప్ చేసాడు అని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు ఆమె వెళ్లి కేంద్ర  మంత్రి పార్టీలో చేరడం హాట్ టాపిక్ అయింది. ఇక ఆమె రాజకీయాల్లోకి రావడంతో అసలు ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుంది అనే దానిపై అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: