సిద్ధిపేటలో బండి సంజయ్ విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. ఈ ఘటనతో కరీంనగర్ కూడా అట్టుడుకుతుంది. జిల్లా వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల ఆందోళనలు  జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసారు. నిరాహార దీక్షకు  బండి సంజయ్ కూర్చున్నారు. ఆయనకు బిజెపి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్  మద్దతు ఇచ్చారు. ఎస్పీ టార్గెట్ గా ఆయన విమర్శలు చేసారు.

జోయల్ పోలిసా గుండానా అని ఆయన ప్రశ్నించారు. జోయల్ డేవిస్ ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేసారు. తెలంగాణ లో ప్రజాస్వామ్యం లేదు అని ఆయన ఆరోపించారు. జోయల్ నా పేరు అరవింద్, నీ పేరు ని నేను గుర్తు పెట్టుంటా అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. ఇక తనపై దాడి చేసిన జోయాల్ ని సస్పెండ్ చేయాలి అని సంజయ్ డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: