ఆంధ్రప్రదేశ్ అవతరణ  దినోత్సవ వేడుకలు జరుగుతాయా లేదా అనే దానిపై అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. సిఎం వైఎస్ జగన్ ఈ విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు ఏంటీ అనే దానిపై ఇంకా ఏ విధమైన స్పష్టత కూడా రాలేదు. ఈ నేపధ్యంలో సిఎం జగన్ కీలక నిర్ణయం వెల్లడించారు. నవంబరు 1 తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవం గా నిర్వహించేందుకు ఉత్తర్వులు చేసింది సిఎం  జగన్ సర్కార్.

రాష్ట్ర రాజధానితో పాటుగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు. అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వ మీడియా సలహాదారు జీవిడి కృష్ణ మోహన్ నేతృత్వంలో 9 మంది అధికారులతో కూడిన కమిటీ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసారు. దీనిపై ఇప్పుడు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: