దుబ్బాకలో తెరాస పార్టీని భారతీయ జనతా పార్టీ ఓడించిన సంగతి తెలిసిందే. ఇక గ్రేటర్ లో కూడా కచ్చితంగా ఓడిస్తామని  తెరాస నేతలకు బిజెపి నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. రాజకీయంగా బలపడే ప్రయత్నం చేస్తున్న బిజెపి గ్రేటర్ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంది. తాజాగా బాబు మోహన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సిని నటుడు బిజేపి నాయకుడు బాబుమోహన్ తెరాస ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.

దుబ్బాక గెలుపు అంటే... సియం కేసిఆర్ పై గేలిచినట్లే అని ఆయన వ్యాఖ్యలు చేసారు. జిహేచ్ఎంసి ఎన్నికలో బిజేపి జేండా ఎగురువేస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా వుంది అని మండిపడ్డారు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు అన్నారు. రాబోవు ఎన్నికలలో తెలంగాణ, ఎపిలో బిజేపి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని ఆయన ధీమా వ్యాక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: