భారత సీనియర్‌ లెగ్‌స్పిన్నర్‌ పియూష్‌ చావ్లా తండ్రి ప్రమోద్‌ కుమార్‌ (60) కూడా కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణ వార్త మరచిపోకముందే మరో విషాదం చోటు చేసుకుంది . భారత మాజీ పేసర్‌ ఆర్పీ సింగ్‌ తండ్రి శివప్రసాద్‌ సింగ్‌ కరోనా వైరస్‌తో పోరాడుతూ బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆర్పీ సింగ్‌ ట్విటర్లో వెల్లడించారు.
 ఈ మేరకు ఆయన ట్వీట్టర్ ఖాతాలో.."నా తండ్రి శివప్రసాద్‌ సింగ్‌ కన్నుమూసిన విషయాన్ని తీవ్ర దు:ఖంతో తెలియజేస్తున్నాను. నా తండ్రి ఆత్మకు శాంతి చేకూరేలా మీరంతా ఆ దేవుణ్ని ప్రార్థించాలని కోరుతున్నా. RIP పాపా’ అంటూ సింగ్‌ ట్వీట్‌ చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: