మావోయిస్టు అగ్రనేత కత్తి మోహన్ రావు అలియాస్ ప్రకాషన్న అలియాస్ దామదాద అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన జూన్ 10వ తేదీన ఉదయం 11 గంటల 20 నిమిషాలకు గుండెపోటుతో మరణించారు అని మావోయిస్టు పార్టీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మోహన్ రావు మృతి పట్ల పార్టీ ప్రకటనతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

 మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గార్ల గ్రామానికి చెందిన మోహన్ రావు 39 ఏళ్ల క్రితమే నక్సలైట్ మూమెంట్ లోకి వెళ్లి అప్పటి నుంచి అజ్ఞాతం లోనే ఉంటున్నారు. మహబూబాబాద్ లో ఇంటర్ ఖమ్మంలో డిగ్రీ కాకతీయ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి ఆయన డబల్ గోల్డ్ మెడల్ కూడా సాధించారు.  నక్సలైట్ ఉద్యమంలో చేరిన ఆయన దండకారణ్యంలో విప్లవ పాఠాలు బోధిస్తున్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: