మోడీ ఇటలీ పర్యటన తరువాత గ్లాస్గౌలో నిర్వహించే కాప్-26 ప్రపంచ నేతల సదస్సుకు హాజరయ్యేందుకు బ్రిటన్ వెళ్లనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ మోడీని ఆహ్వానించారు. అక్టోబర్ 31 నుండి నవంబరు 12 వరకు కాప్-26 సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ‘ప్రపంచ నేతల సదస్సు’ నవంబరు 1-2 మధ్య జరగనున్నది. ఈ సదస్సులో మోడీ పాల్లొంటారు. ఈ సదస్సుకు బ్రిటన్, ఇటలీ అధ్యక్షత వహించనున్నాయి. ఇందులో 120పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు.
భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతున్న 8వ జీ-20 సదస్సు కావడం విశేషం. తొలిసారిగా 2023లో జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశంలో మూడు ప్రధాన అంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ, బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ తో పాటు వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక భేటీల్లో ప్రధాని పాల్గొననున్నారు.