ఇద్దరి మధ్య లవ్ అనేది ఇప్పుడు పడుతుందో ఎలా పుడుతుందో ఎక్కడ పుడుతుందో, ఎవరిపైన పుడుతుందో కూడా తెలియదు. ఇదే ప్రేమకున్న ప్రత్యేకత. అలాంటి ఓ ప్రేమికులే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లవ్ కుదుర్చుకున్నారు. ఇక్కడ అమ్మాయి శ్రీకాకుళం జిల్లాకు చెందిన అమ్మాయి. అబ్బాయి తెలంగాణ లోని నల్గొండ జిల్లాకు చెందిన అబ్బాయి. వీరిద్దరు హైదరాబాదులో ఒకే దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే  మనసు మనసు కలిసింది ప్రేమ పావురం బయటకు వచ్చింది. గాఢమైన ప్రేమలో మునిగితేలారు. పెళ్లి చేసుకోవాలని అనుకొని  ఇరువురి పెద్దలను కూడా ఒప్పించారు. తీరా పెళ్లి చేసుకుందామని టైముకు అమ్మాయి తరఫున వాళ్ళు మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంతలో అమ్మాయిని వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం కూడా చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన టువంటి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఒక్క సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.

 నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండల పరిధిలోని గండిగుండం గ్రామానికి చెందినటువంటి మీరెడ్డి శేఖర్ రెడ్డి చిన్న కొడుకు 24 సంవత్సరాలు. బీటెక్ పూర్తి చేసి ఆయన హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు   అతనితో పాటు అక్కడే ఉద్యోగం చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన అటువంటి యువతితో పరిచయం ఏర్పడినది. ఈ యొక్క వారి పరిచయం  కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. దీంతో ఒకరిని ఒకరు గాడంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం వారి పెద్దలను కూడా ఒప్పించాలి అనుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న టువంటి యువతి తల్లిదండ్రులు అమ్మాయికి బలవంతంగా మరో అబ్బాయితో వివాహం చేశారు. ఆ యువతి తనకు ఇష్టం లేదని చెప్పినా కానీ పట్టించుకోలేదు. దీంతో అమ్మాయి  తన కాపురాన్ని కూడా వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటోంది. తనకు ఇష్టం లేని వివాహం చేశారని ఆ అమ్మాయి లహరి తన ప్రియుడు వద్దకు వచ్చినది. దీంతో ఇద్దరూ కలిసి కొద్దిరోజులు బెంగళూరు వెళ్లిపోయారు.

దీంతో వీరి కోసం వారి తల్లిదండ్రుల వెతికారు. చివరికి ఫోన్ సిగ్నల్స్ ద్వారా వారు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించారు. వీరు ఆచూకీని కనిపెట్టి వినయ్ రెడ్డి పై దాడి చేసి  అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు. అబ్బాయి వద్ద ఉన్నటువంటి డబ్బులు, మెడలోని బంగారు గొలుసును కూడా లాక్కెళ్లారు. దీంతో వినయ్ రెడ్డి ఎలా గోల తన గ్రామానికి చేరుకున్నాడు. ఈ జరిగినటువంటి పరిణామాలతో ఆయన తీవ్రమైన మనోవేదనకు గురై రాత్రి సమయంలో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బావి వద్ద చెప్పులు అతని సెల్ ఫోన్ ఉండడంతో అతను బావిలో దూకడం వారు గుర్తించారు. దీంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: