యాంకర్ రష్మి బుల్లితెరపై ఎంతటి హంగామా చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుందో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుందని అందరకి తెలుసు.తనకు సంబంధించిన విషయాలపై అలాగే సామాజిక అంశాల పై కూడా స్పందిస్తూ ఉంటారని తెలుస్తుంది..

ముఖ్యంగా రష్మీ జంతు ప్రేమికురాలు అనే విషయం అందరికి తెలుసు.మూగజీవాలకు ఏదైనా హాని జరిగితే రష్మి ఎంతో విలవిల్లాడిపోతోందని తెలుస్తుంది.. ఇలా మూగజీవాల గురించి ఎన్నోసార్లు సోషల్ మీడియాలో స్పందించిన రష్మీ తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారని తెలుస్తుంది.

దీపావళి పండుగ సందర్భంగా పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఒక హృదయ విదారక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని సమాచారం.కొందరు ఆకతాయిలు నోరులేని మూగజీవాలను హింసిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే కొందరు యువకులు కుక్క తోకకు టపాకాయలు కట్టి అంటించడంతో ఆ కుక్క తోక తీవ్రంగా గాయపడి తెగిపోయిందని సమాచారం. ఇది గ్రహించిన స్థానికులు వెంటనే ఆ కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందించారట.

ప్రస్తుతం ఈ వీడియో రష్మీ కంట పడటంతో రష్మీ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తుంది.ప్రస్తుతం మనుషుల్లో మానవత్వం లేకుండా పోయింది అని ఇలా మూగజీవాల పట్ల దారుణంగా ప్రవర్తించే వారికి భూమిపై నివసించే అవకాశమే లేదని రష్మీ కన్నీళ్లు పెట్టుకున్నారని తెలుస్తుంది.. ఈ క్రమంలోనే ఈ విషయం వైరల్ కావడంతో చాలామంది రష్మి కి సపోర్ట్ చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం రష్మీ ఎక్సట్రా జబర్దస్త్ మరియు ఢీ షో లతో బిజీగా ఉందని తెలుస్తుంది. ఎంత బిజీ గా వున్నా కూడా తన పర్సనల్ లైఫ్ లో కొన్నిటికి ఇవ్వాల్సిన విలువలు ఇస్తుందని తెలుస్తుంది. ఆమెకు జంతువులపై వున్నా ప్రేమ ఎటువంటిదో అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: