నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే, అయితే ఇలా అఖండ సినిమా మంచి విజయం సాధించడంతో బాలకృష్ణ కూడా వరుస పెట్టె సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అఖండ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న  బాలకృష్ణ, పోయిన సంవత్సరం క్రాక్ సినిమా విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు కమిట్ అయ్యాడు, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి, ఈ సినిమాలో బాలకృష్ణ సరసన అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది, అలాగే ఈ సినిమాలో దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండగా మరో ముఖ్యమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో నటించబోతోంది.

 ఇది ఇలా ఉంటే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా పూర్తి అవగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమాలో నటించబోతున్నాడు, అనిల్ రావిపూడి సినిమా తర్వాత బాలకృష్ణ, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, బాలకృష్ణ, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతునట్లు  వార్తలు వస్తున్నాయి,  అలాగే ఈ సినిమాలతో  పాటు పరుశురామ్ దర్శకత్వంలో కూడా బాలకృష్ణ మరొక సినిమాలో నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజ రవితేజ వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతూ ఫుల్ జోష్ లో ఉన్నారు, ప్రస్తుతం బాలకృష్ణ కూడా వరుస సినిమాలను లైన్ లో పెట్టే ఉద్దేశ్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: