అయితే ప్రస్తుతం నాగబాబు నిర్మాణం పైన మళ్లీ దృష్టి పెట్టారు అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నాగబాబు నిర్మాతగా ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. ముఖ్యంగా నాగబాబు ఆరెంజ్ సినిమాతో డిజాస్టర్ ను చవి చూసి కొన్ని కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాడు. ఇక ఈ సమయంలో పవన్ కళ్యాణ్ సహాయం చేశాడని ప్రచారం కూడా ఉన్నది. ఎన్నో ఇబ్బందులు పడ్డ నాగబాబు చాలా కాలం తర్వాత నా పేరు సూర్య సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ చిత్ర నిర్మాణంలో కూడా షేర్ ను తీసుకొని.. ఆ సినిమాతో కూడా నిరాశ పడ్డాడు.
ఇక దీంతో మళ్లీ నిర్మాణం వైపు తన అడుగులు వేయలేదు. కానీ తన సోదరులు మాత్రం డేట్లు అడిగితే నాగబాబుకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు నాగబాబు మాత్రం వీరితో సినిమాలు తీయాలనే ఆలోచనలో లేనట్లుగా సమాచారం.ఇక తన కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు కనుక ఈయనతో నిర్మాతగా రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు గా సమాచారం వినిపిస్తోంది. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక చిత్రాన్ని కన్ఫామ్ చేశారు. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఓకే చెప్పడంతో ఇక ఈ కాంబినేషన్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఈసారైనా నాగబాబు సక్సెస్ అవుతాడా లేదా చూడాలి.