ఇక సాధారణంగా పెద్ద నిర్మాణ సంస్థలో సినిమాలు చేసే హీరోలకి అగ్రిమెంట్ పై సైన్ చేసే ముందే కొన్ని నియమాలు ఖచ్చితంగా ఉంటాయి. తన సినిమా పూర్తయ్యేలోపు ఆ నిర్మాణ సంస్థ నిర్మించే చిన్న ఇంకా అలాగే మిడ్ రేంజ్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లకి కూడా గెస్ట్ లు గా వెళ్ళాలి అనేది ఆ అగ్రిమెంట్లో ఒక రూల్ గా ఉంటుంది.ఇక నిర్మాతలు ఆ బడా హీరోలకు చెల్లించే పారితోషికంలో ఇది కూడా ఒక భాగమై ఉంటుంది.అలాగే ఆ చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాక కూడా వాటి పై పాజిటివ్ గా సోషల్ మీడియాలో స్పందించాల్సి ఉంటుంది. ఇక 'మైత్రి మూవీ మేకర్స్' నిర్మాతలు ఇది పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ ఉంటారు. 'సర్కారు వారి పాట' సినిమా పూర్తయ్యేలోపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తమ 'ఉప్పెన' ఇంకా 'పుష్ప' సినిమాలకి అలాగే ప్రమోషన్లు కూడా చేయించుకున్నారు.'పుష్ప' సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ మహేష్ తో సోషల్ మీడియాలో పాజిటివ్ గా పోస్ట్ వేయించుకున్నారు. కాకపోతే 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషన్ల విషయంలో మాత్రం తమ హీరోలతో ఎలాంటి పోస్టులు వేయించలేకపోయారు.ఇదే మహేష్ కి ఇంకా ఆయన ఫ్యాన్స్ కి వున్న కోపం.పైగా అసలు సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్లు సరైన విధంగా చేయలేకపోయారు.


నిజానికి సినిమా చాలా బాగా ఆడుతూ 3 వారాలు పూర్తయ్యేసరికే రెంట్ పద్ధతిలో అమెజాన్ లో వదిలేశారు. సర్కారు వారి పాట ప్రమోషన్ల కోసం మహేష్ బాబు ఇంకా 14 రీల్స్ వారే ఖర్చుపెట్టినట్లు భోగట్టా. ఈ కారణాలతో మహేష్ బాబుకు.. 'మైత్రి' కి చెడింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.అసలు నిజానికి 'అంటే సుందరానికీ!' ప్రీ రిలీజ్ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబుని గెస్ట్ గా ఆహ్వానించాలి అని ఆ చిత్రం దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇంకా నాని లు అనుకున్నారు.కాకపోతే మహేష్ మైత్రి వారు చేసిన తప్పుకి కోపంతో ఈ వేడుకకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో ఈ విషయాన్ని 'మైత్రి' వారు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని పవన్ కళ్యాణ్ ను సంప్రదించి తీసుకొస్తున్నారు అని తెలుస్తుంది. ఈ బ్యానర్లో పవన్ కళ్యాణ్ ఇంకా హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. ఆ ఆబ్లిగేషన్ పైనే పవన్ కళ్యాణ్ 'అంటే సుందరానికీ' ప్రీ రిలీజ్ వేడుకకు రావడానికి అంగీకరించినట్లు సమాచారం తెలుస్తోంది. పైగా పవన్ కళ్యాణ్ కి మహేష్ బాబుకి ఎప్పుడూ కూడా గట్టి పోటీ అనేది ఉంటుంది.అందుకే కావాలనే మైత్రి వారు పవన్ ని ఆహ్వానించడం జరిగింది.నిజానికి పాపం మహేష్ అయిన నిర్మాతల కోసం సినిమాని ప్రమోట్ చేస్తాడు కానీ, పవన్ కళ్యాణ్ అయితే అసలు అలా చెయ్యడు. అన్నిటికి పారితోషికం తీసుకుంటాడు. అంతే ఇక సినిమా చేసామా అయిపోయిందా అన్నట్లు ఉంటాడు. తరువాత ఏమి పట్టించుకోడు. ఈ విషయం త్వరలోనే మైత్రికి అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: