మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో వీరి కాంబో లో తెరకెక్కిన రెండు సినిమాలు ప్రేక్షకులను వేరే స్థాయి లో అలరించగా ఇప్పుడు రాబోయే ఈ సినిమా అంతకుమించి ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా మొదలు కాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సర్కార్ వారి పాట సినిమా తర్వాత రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరి ఈ సినిమా ఏ స్థాయి లో తెరకెక్కి ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో మొద లు కావాల్సి ఉండగా ఇప్పటిదాకా ఈ సినిమా మొదలు పెట్టక పోవడం మహేష్ అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం యొక్క అధికారిక ప్రకటన ఇవ్వడం తో ఒక్క సారిగా అందరూ ఎంతగానో సంతోషపడ్డారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

తాజాగా ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా నటించే నటీ మణుల గురించి అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పటికే దర్శ కుడు త్రివిక్రమ్ మరియు చిత్ర బృందం కలిసి రెండో హీరోయిన్ ను ఎంపిక చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి నుంచి ఈ పాత్రలో హీరోయిన్ శ్రీ లీల ను అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ ప్లేస్లో మరికొంతమంది హీరోయిన్లు రావడం ఆమెకు ఈ అవకాశం వస్తుందో రాదో అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ రేసులో మరికొంతమంది హీరోయిన్లు కూడా జాయిన్ అయ్యారు. ప్రియాంక మోహన్ అలాగే కేతికా శర్మ లాంటి మరికొంతమంది హీరోయిన్లు ఈ సినిమాలో రెండో హీరోయిన్ అవకాశం అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యం లో ఈ అవకాశాన్ని ఎవరు అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: