తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ఇక  దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన మళ్ళీ వెండితెర మీద కనిపించడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ రచ్చ చేసారు.ఇకపోతే వరుస విజయాలతో రాకెట్ స్పీడ్ లో దూసుకు పోతున్న మహేష్ సర్కారు వారి పాట సినిమా తర్వాత మరొక రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టాడు.కాగా ప్రెసెంట్ మహేష్ బాబు తన 28వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు.అయితే  త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు.. 

అయితే దీంతో ఇప్పుడు చేసే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి..ఇక  11 ఏళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.పోతే  ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.కాగా ఈ సినిమా గురించి నిన్న అంతా ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది. పోతే మన టాలీవుడ్ లో ఆగష్టు 1 నుండి షూటింగ్ లు నిలిచి పోనున్నాయనే విషయం విదితమే..ఇక  ఈ క్రమంలోనే ఈ సినిమా కూడా సమ్మె కారణంగా ఆగష్టులో అసలు సెట్స్ మీదకే వెళ్ళదు అంటూ వస్తున్న వార్తలకు తాజాగా ఒక క్లారిటీ వచ్చేసింది.

కాగా ఈ సమస్యను వీలైనంత త్వరగానే సినీ పరిశ్రమ పెద్దలు, నిర్మాతలు అందరు కలిసి పరిష్కరించ నున్నారని.. అంతేకాదు మళ్ళీ యథావిధిగా షూటింగులు జరగనున్నాయని టాక్ బయటకు వచ్చింది.. పోతే ఈ నేపథ్యంలోనే మహేష్, త్రివిక్రమ్ సినిమాపై ఈ సమ్మె ప్రభావం ఉండదని అంటున్నారు.అయితే ఎందుకంటే ఈ సినిమా ఆగష్టు 15 లేదా 16 తేదీల్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు..పోతే  ఈ లోపే ఈ సమస్య పరిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అందుకే మహేష్ సినిమా షూటింగ్ ఎట్టపరిస్థితుల్లో ఆగిపోయే అవకాశం లేదనే చెప్పాలి.. ఇకపోతే  ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇక హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: