సీనియర్ హీరోలు అంతా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటిస్తూ  తమ వారసత్వాన్ని  కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఒక్క హీరో మాత్రం ఇప్పటివరకు ఒక్క కొత్త ప్రాజెక్టును ఇంకా ప్రకటించలేదు. దీంతో అసలు ఏం జరుగుతుందో ఆయన అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇక తాజాగా సరికొత్త ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే సీనియర్ హీరో వెంకటేష్ చివరిగా f-3 సినిమా తర్వాత ఏ సినిమాని ఒప్పుకోలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే నటిస్తున్న కబీ ఈద్ కభీ దివాళి అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాలతో పాటు నెట్ ఫ్లెక్స్ కోసం రానాతో కలిసి రామానాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.


అయినా వెంకటేష్ మాత్రం తెలుగులో డైరెక్ట్ గా ఏ సినిమాను అంగీకరించలేదు. తాజాగా శివ నిర్వాణ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గారపాటి హరీష్ నిర్మించబోతున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాకు సంబంధించి ఒక అధికారికంగా ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. డైరెక్టర్ శివ నిర్వాణ లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ డైరెక్టర్ సమంత , విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే వెంకటేష్ కు పూర్తి కథ వినిపించి వచ్చే యేడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక అంతే కాకుండా తమిళ మూవీ అయిన ఓ మై కడవులే.. అనే చిత్రాన్ని తెలుగులో విశ్వక్సేన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్రలో వెంకటేష్ గెస్ట్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇక రానా , వెంకటేష్ కలిసి మొదటిసారి రామానాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. దీంతో విక్టరీ వెంకటేష్ అభిమానులు కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: