‘అర్జున్ రెడ్డి’ మూవీ సూపర్ డూపర్ సక్సస్ తో విజయ్ దేవరకొండ మ్యానియా తెలుగు రాష్ట్రాలలోని యూత్ కు విపరీతంగా సోకింది. అయితే ఆతరువాత అతడి స్థాయిని ‘గీత గోవిందం’ మరో మెట్టు ఎక్కించినప్పటికీ ఆతరువాత విజయ్ దేవరకొండ తన ఇమేజ్ ని పెంచుకునే సినిమాలను చేయలేకపోయాడు.


ప్రస్తుతం వరస ఫెయిల్యూర్ లతో సమతమైపోతున్న ఈ యంగ్ హీరోకు ‘లైగర్’ ఫ్లాప్ గట్టి షాక్ అనుకోవాలి. ప్రస్తుతం ఇతడు సమంతతో నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ తప్పించి మరే సినిమాలు అతడి చేతిలో లేవు. వాస్తవానికి ‘లైగర్’ ఫ్లాప్ అయినప్పటికీ నటుడుగా ఆమూవీలో విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ మీడియా కూడ విజయ్ దేవరకొండకు నటుడుగా మంచి భవిష్యత్ ఉంది అంటూ కామెంట్స్ వ్రాసింది.


‘లైగర్’ విడుదల కాకముందే బాలీవుడ్ లో విజయ్ కు కొన్ని అవకాశాలు వచ్చాయి అని అంటారు. అయితే ఆ ప్రాజెక్ట్స్ ఏమి కార్యరూపం దాల్చలేదు. తెలుగులో కూడా విజయ్ సుకుమార్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయి ఉన్నాడు. అయితే ఆమూవీ ‘పుష్ప 2’ తరువాత మాత్రమే ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘ఖుషీ’ మూవీ కాశ్మీర్ నేపధ్యంలో జరిగే ఒక లవ్ స్టోరీ కథ.


దర్శకుడు శివ నిర్వాణ ఈమూవీని డిఫరెంట్ గా తీస్తున్నప్పటికీ విజయ్ దేవరకొండ మాస్ అభిమానులకు ఈసినిమా ఎంతవరకు నచ్చుతుంది అన్న సందేహాలు ఉన్నాయి. దీనికితోడు సమంతతో విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఏమేరకు సెట్ అవుతుంది అన్న ప్రశ్నలు కూడ తలెత్తుతున్నాయి. ఇన్ని ప్రశ్నలు ఎదురవుతున్నప్పటికీ విజయ్ కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు అన్న విషయం లేటెస్ట్ గా దుబాయ్ లో జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో మరొకసారి రుజువైంది. ఆ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారంలో స్టార్ స్పోర్ట్స్ టివి కూడ విజయ్ ని క్లోజప్ లో పలుమార్లు చూపించడం చూసిన వారికి ఒక్క సరైన హిట్ పడితే చాలు తిరిగి విజయ్ ట్రాక్ లోకి వస్తాడు అన్న అభిప్రాయం కలుగుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: