ప్రతిరోజు కొన్ని ఫోటో షూట్లతో పాటు ఏదైనా జంతువులకు సంబంధించిన వాటిని షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక నేటిజన్ కు ఒక దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా ఒక భారీ వినాయక విగ్రహాన్ని ఒక ఏనుగుతో పూలమాల వేయించారు కొందరు.. ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో చాలా పాపులర్ గా మారుతోంది. ఆ వీడియో పై స్పందించిన రష్మి .. అలా వినాయక విగ్రహం మెడలో పూలమాల వేసే సమయంలో ఆ ఏనుగు ఎంతగా ఇబ్బంది పడిందో అంటూ ఆమె ఆవేదనను తెలియజేసింది.
ఇలా మన సంతోషం కోసం జంతువులను ఉపయోగించుకోవడం చాలా తప్పని ట్వీట్ చేయడం జరిగింది రష్మీ. రష్మీ ట్వీట్ పై కొంతమంది పలు రకాలుగా స్పందించారు. ఒక నెటిజన్ మాత్రం మీరు జంతు ప్రేమికులేమీ కాదని మాకు తెలుసు మీరు హిందువులకు వ్యతిరేకంగా ఉన్నారు అంటూ కామెంట్లు చేశారు. దీంతో రష్మీ స్పందిస్తూ.. నేను నంది, గోమాతలను కూడా గౌరవిస్తానని అందుచేతానే నేను లెదర్ తో చేసిన వస్తువులను వాడను అంతేకాకుండా పాల పదార్థాలను అసలు తీసుకొని ఎందుచేత అంటే పాల కోసం ఆవు తన జీవితకాలంలో ఎన్నోసార్లు గర్భం దాలుస్తుందని తెలియజేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది.