మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ సినిమాలలో నటించడానికి చాలా సమయం తీసుకున్నారు. చాలావరకు సాయి ధరమ్ తేజ్ విశ్రాంతి తీసుకొని పూర్తిగా కోలుకున్న తర్వాతే సినిమా షూటింగులో పాల్గొనడానికి మొదలుపెట్టారు. ఇక మొత్తానికి ఇటీవల తన 15వ సినిమాకు సంబంధించి సాయి ధరంతేజ్ ఎలాగైనా మళ్ళీ కం బ్యాక్ ఇవ్వాలని సన్నహాలు చేస్తున్నారు. సాయి ధరంతేజ్ చివరిగా రిపబ్లిక్ సినిమాతో ముందుకు వచ్చిన అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఈ చిత్రం కమర్షియల్ గా మాత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను సంపాదించలేకపోయింది. ఇప్పుడు తాజాగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న 15వ సినిమాకు సంబంధించి విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది.


ఒక మిస్టరీ థ్రిల్లర్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ఇందులో కథను మాత్రం డైరెక్టర్ సుకుమార్ అందించడం మరొక ఆసక్తికరమైన విషయంగా మారుతోంది. ఇక ఈ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చిందనే విషయాన్నికి వెళ్తే.. సెప్టెంబర్ ఐదున కేరళలో షూటింగ్ ప్రారంభించారని చిత్రగుండం ప్లాన్ చేసింది నవంబర్ చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం సినిమాలో నటించిన హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నది ఇక ఈ సినిమాకి డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.


శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ రైటింగ్స్  అందిస్తున్నారు ఈ సినిమాలో బ్రహ్మాజీ, సునీల్ తదితరులు ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా లైన్ గురించి ఆమధ్య ఒకటాక్ వినిపించింది. ఈ సినిమా మొత్తం మంత్రాలు చుట్టూ తిరుగుతుందని అంతేకాకుండా వరుసగా జరుగుతున్న మర్డర్ మిస్టరీల గురించి హీరో ఏ విధంగా చేదిస్తాడో అని కథాంశంతో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక డైరెక్టర్ సుకుమార్ ఇలాంటి కథ అందించడంతో ఈ సినిమా మరింత హైలెట్గా కావడం గమనార్హం. మరి ఈ సినిమాతో నైనా సాయి ధరంతేజ్ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: