టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ తాజాగా  బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25 వ తేదీన విడుదల అయిన లైగర్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర అపజయం  పాలయింది.

ఇలా లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచినప్పటికీ విజయ్ దేవరకొండ కు మాత్రం క్రేజీ సినిమా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. లైగర్ మూవీ సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండ , శివ నిర్మాణ దర్శకత్వం లో ఖుషి మూవీ మొదలుపెట్టిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో సమంత , విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. లైగర్ మూవీ సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జన గణ మన మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కాకపోతే ఆ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దానితో విజయ్ దేవరకొండ మరో ఇద్దరు స్టార్ దర్శకులను లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ 'ఖుషి' మూవీ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాల కోసం అదిరిపోయే లైనప్ ని సెట్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: