టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ అతి త్వరలో చేయబోయే 27వ సినిమాకు సంబంధించి కథా చర్చల్లో ప్రస్తుతం పాల్గొంటున్నట్లు సమాచారం. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు తో హిట్ కొట్టిన సూపర్ స్టార్ , కెరీర్ పరంగా వరుసగా మూడవ విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ నమోదు చేసారు. అంతకముందు భరత్ అనే నేను, అలానే మహర్షి సినిమాలతో మంచి హిట్స్ కొట్టిన సూపర్ స్టార్, సరిలేరు హ్యాట్రిక్ సక్సెస్ తరువాత తన కుటుంబంతో కలిసి ఇటీవల విదేశాలకు వెళ్లి కొన్నాళ్ళు ప్రశాంతంగా గడిపి వచ్చారు. 

 

అయితే మహేష్ నటించబోయే తదుపరి సినిమా దర్శకుడి విషయంపై మన టాలీవుడ్ లో చర్చ జరుగుతుండగా మరొకవైపు మహేష్ బాబు తీసుకుంటున్న పారితోషికం విషయమై అటు బాలీవుడ్ లో నేడు విపరీతంగా చర్చలు మొదలయినట్లు సమాచారం. మొన్నటి సరిలేరు సినిమాకు మొత్తం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న సూపర్ స్టార్ స్టార్, అందులో చాలా వరకు రెమ్యునరేషన్ రూపంలోనూ, అలానే మిగతాది లాభాల్లో వాటాల రూపంలో తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. 

 

అయితే మహేష్ మాత్రమే కాక మరికొందరు హీరోలు కూడా ఇటీవల సొంత సంస్థలు ప్రారంభించి, ఇతర నిర్మాతలతో కల్సి సినిమాలు నిర్మించి ఈ విధంగా అత్యధికంగా పారితోషికాలు తీసుకుంటున్న విధానం చాలా బాగుందని, అతి త్వరలో బాలీవుడ్ హీరోలు కూడా ఇకపై ఈ తరహా విధానాన్ని అమలు చేసి తమ పారితోషికాలు మరింతగా పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నారట అక్కడి హీరోలు. నిజానికి మన తెలుగు స్టార్ అయిన మహేష్ పారితోషికం విషయమై బాలీవుడ్ లో ఈ విధంగా చర్చలు జరగడం నిజంగా ఒకింత మన వరకు గొప్ప విషయమేనని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ విధంగా బాలీవుడ్ లో నేడు మహేష్ పేరు వైరల్ గా మరి ప్రచారం అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: