టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం పెళ్ళి పనుల్లో బిజీగా ఉన్న విషయమ్ తెలిసిందే. ఒక సంవత్సరం పైగా అర్జున్ సురవరం సినిమా రిలీజ్ కోసం ఎంతగానో కష్టపడి చివరాఖరికి రిలీజ్ చేశాడు. వేసవిలో రావాల్సిన సినిమా కాస్తా వాయిదాలు పడుతూ పడుతూ చలికాలంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఆడుతుందని ఎవరూ అనుకోలేదు.. కానీ ఉన్నంతలో ఫర్వాలేదు అనిపించింది. అయితే ఈ సినిమా అనంతరం నిఖిల్ కార్తికేయ 2 సినిమాలో చేస్తున్నాడని తెలిసిందే.

 

 

చైత్రంలో కార్తికేయ 2 సినిమా చిత్రీకరణ మొదలవుతుందని వీడియోని కూడా వదిలారు. ఇదిలా ఉంటే నిఖిల్ మరో చిత్రం కూడా కొద్దిరోజుల్లో స్టార్ట్ కానుంది. సుకుమార్ రాసిన కథతో జీఏ 2 బ్యానర్ లో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం ఇంతకుముందే వచ్చింది. అయితే నేడు ఈ సినిమా విషయమై మరింత క్లారిటీ వచ్చింది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో "18 పేజేస్" పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతుందని రివీల్ చేశారు.

 

 

ఒక అందమైన పేజీలో ఈ సినిమా విశేషాలను రాస్తూ నిఖిల్ తో ఈ సినిమా చేస్తున్నామని వివరించారు. ఇదొక న్యూ ఏజ్డ్ లవ్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందట. సుకుమార్ రాసిన ప్రేమ కథలన్నీ చాలా కొత్తగా ఉంటాయన్న విషయం తెలిసిందే. అలాంటి కొత్త కథతో మనల్ని మాయ చేయడానికి సుకుమార్ రాసిన కథ ఇది. నిఖిల్ కి కెరీర్ విషయంలో ఈ సినిమా చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

 

 

నిఖిల్ పెళ్ళి తర్వాత కార్తికేయ 2 చిత్రీకరణ మొదలవుతుంది. మరి కార్తికేయసినిమా అయ్యాకే ఈ సినిమా మొదలెడతాడా లేదంటే దానితో పాటు ఈ సినిమాని కూడా కొసాగిస్తాడా అనేది సందేహంగా ఉంది. మరి నిఖిల్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: