మాలీవుడ్ లో 2002లో ‘ఉత్తర’ చిత్రంతో బాలనటిగా తెరంగేట్రం చేసింది నివేదా థామస్.  మాలీవుడ్ లో ‘వెరుథె ఒరు భార్య’ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు పొందారు. తెలుగు లో నాని హీరోగా నటించిన ‘జెంటిల్ మేన్’ చిత్రంలో నటించింది.  ఈ చిత్రం తర్వాత  నివేదా థామస్ కి వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. తెలుగు లో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రంలో కూడా ఈ అమ్మడికి మంచి పేరు వచ్చింది.  తమిళంలో రజనీకాంత్ (దర్బార్) వంటి స్టార్లతో కూడా నివేద నటించింది.  ప్రస్తుతం 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ సరసన కూడా నటిస్తోంది.  ఈ నేపథ్యంలో  నివేద థామస్ మరో మంచి ఆఫర్ వచ్చింది.

IHG

మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రంలో ఓ కీలక పాత్రకు ఆమెను  తీసుకోబోతున్నారని టాలీవుడ్ టాక్. కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ చిత్రం ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థలోని లోసుగులపై దర్శకుడు పరశురాం దీనిని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

IHG

చిత్రంలో బ్యాంక్ లో చిత్రీకరించే సన్నివేశాలు చాలా ఉండడంతో హైదరాబాదులో ప్రత్యేకంగా ఓ అధునాతన బ్యాంక్ సెట్ ను వేస్తున్నట్టు తెలుస్తోంది. గత మూడు నెలల నుంచి దేశంలోకరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్స్ మొత్తం ఆపివేసిన విషయం తెలిసిందే. ఈ మద్య తెలంగాణలో షూటింగ్స్ కి పరిమిషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పరుశరామ్-మహేష్ మూవీ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: