ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు దశాబ్ద కాలానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత కొన్నాళ్లపాటు బాలీవుడ్ పై కన్నేసింది అన్న విషయం తెలిసిందే. అక్కడ స్టార్ హీరోలతో కలిసి కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. అక్కడ మాత్రం బాలీవుడ్ ఎంట్రీ అంతగా కలిసిరాలేదు. దీంతో బాలీవుడ్లో అవకాశాలు రాక ఇటు టాలీవుడ్ దర్శకులు కూడా కొత్త హీరోయిన్ల రాకతో రకుల్ ప్రీత్ సింగ్ ని మర్చిపోవడం తో తెలుగు తెరపై కనుమరుగైపోయింది రకుల్ ప్రీత్ సింగ్. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానులకు మాత్రం అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
అయితే పలు వివాదాల కారణం గా రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని సినిమాల నుంచి తప్పుకుంది అన్న వార్త గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దీనిపై ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ఇచ్చింది. రకుల్ ఏ సినిమా నుంచి తప్పుకో లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చెక్ మూవీ లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో.. కన్నడంలో శివ కార్తికేయన్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్లు తెలిపింది రకుల్ టీం. మరోవైపు బాలీవుడ్ లో జాన్ అబ్రహంతో అజయ్ దేవగన్ తో, అమితాబ్ బచ్చన్ తో కూడా ప్రస్తుతం రకుల్ వరుసగా సినిమాలు చేస్తున్న ట్లు రకుల్ టీమ్ స్పష్టత ఇచ్చింది.