పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. 2012లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక దాని తర్వాత మరొకసారి అతి త్వరలో పవన్, హరీష్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు. అతి త్వరలో ఈ సినిమా యొక్క ప్రారంభోత్సవం జరగనుండగా మరొక మూడు నెలల్లో దీనిని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాకి ఫోటోగ్రాఫర్ గా ఆయనంక బోస్ వ్యవహరించనున్నారు. గతంలో పలు బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ సినిమాలకి కూడా పనిచేసి కెమెరామెన్ గా ప్రేక్షకాభిమానుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న బోస్ ఈ ప్రతిష్టాత్మక మూవీ కోసం పనిచేస్తుండటం ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల మాట్లాడుతూ చెప్పారు.

ఇక నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియజేశారు. మరోవైపు పవన్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా పవన్, హరీష్ ల కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని అలాగే ఒక స్టార్ హీరోయిన్ ఆయనకు జోడీగా నటించనుందని అంటున్నారు. మరి చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్ ని అలరిస్తుందో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయక తప్పదు అంటున్నారు విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: