టాలీవుడ్ లో జయసుధ గారి గురించి చెప్పాలంటే అక్కినేని నాగేశ్వర రావు , సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ ల సరసన నటించింది జయసుధ.. ఆమె ఎంత గొప్ప నటో అందరికి తెలిసిందే.. అలనాటి తరం నుంచి ఈనాటి తరం దాకా అందరి హీరోలతో నటించింది జయసుధ.. హీరోయిన్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన జయసుధ ఆ తర్వాత వరుసగా సినిమా చేసి ఆ తర్వాత అవకాశాలు తగ్గినా జయసుధ ఏమాత్రం ఆలోచించకుండా తన వయసుకు తగ్గ పాత్రలు చేసింది.. ఇప్పుడు అమ్మ పాత్రలకు, వదిన పాత్రలకు కూడా పెట్టింది పేరుగా నిలిచింది.. పెద్ద సినిమాలకు , పెద్ద హీరోలకు అమ్మ పాత్ర అంటే గుర్తుకొచ్చేది జయసుధ నే. సహజ నటిగా పేరున్న జయసుధ గురించి చెప్పాలంటే చాలానే ఉంది..  

మొదట్లో వదిన పాత్రలు చేసిన జయసుధ ఆ తర్వాత అమ్మ పాత్రలు చేసేది. ఇకముందు బామ్మా పాత్రలు కూడా చేస్తుంది కాబోలు.తాజాగా  జయసుధను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆమెకు ఏమైంది అని ఒకింత ఆందోళన చెందుతున్నారు. నెరిసిన జుట్టు, పీక్కుపోయిన కళ్లతో ఆమె కళా విహీనంగా కనిపించగా, కొందరు ఆలోచనలో పడ్డారు. ఇక గతంతో పోల్చితే జయసుధ ఈ మధ్య సినిమాలు తగ్గించారు. 2019లో మహేష్ నటించిన మహర్షి, బాలయ్య హీరోగా తెరకెక్కిన రూలర్ చిత్రాలలో జయసుధ కీలక రోల్స్ చేయడం జరిగింది.కాగా 'జానకి కలగనలేదు'  అనే ఓ సీరియల్ త్వరలో బుల్లితెరపై ప్రసారం కానుంది.

ఆ సీరియల్ టీమ్ కి బెస్ట్ విషెస్ చెవుతూ జయసుధ ఓ వీడియో చేశారు.ఆ వీడియోలో జయసుధ లుక్ ఆందోళన కలిగించేదిగా ఉంది.  నెరసిన జుట్టు, పీక్కుపోయిన ముఖంతో ఆమె గతానికి బిన్నంగా గుర్తు పట్టలేనంతగా మారిపోయి ఉన్నారు.బరువు కూడా తగ్గారని ఆ వీడియో ద్వారా అర్థం అవుతుంది.  జయసుధ లేటెస్ట్ లుక్ చూసిన ఆమె అభిమానులు.. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.ఇక బాలీవుడ్ నిర్మాత నితిన్ కపూర్ ని ప్రేమ వివాహం చేసుకున్న జయసుధ, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇటీవల పెద్ద కుమారుడు వివాహం గ్రాండ్ గా నిర్వహించారు. నితిన్ కపూర్ 2017లో గుండెపోటుతో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: