సాధారణంగా ఏ యాక్టర్ ను పలకరించిన యాక్టర్ కాకపోయి ఉంటే డాక్టర్ అయ్యే దానిని అని చెబుతారు. అచ్చం సౌందర్య కూడా ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే డాక్టర్ అయ్యేవారు. సౌందర్య ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సమయంలో సినిమాలలో నటించే అవకాశం రావడంతో ఎంబీబీఎస్ పూర్తి చేయలేకపోయారు. కృష్ణ, వాణి విశ్వనాథ్ జంటగా నటించిన "రైతు భారతం" అనే సినిమాలో భానుచందర్ కి జోడిగా సౌందర్య నటించారు. తెలుగులో మొదటి సినిమా ఇదే.
రైతు భారతం తర్వాత మనవరాలు పెళ్లి, రాజేంద్రప్రసాద్ రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో నటించారు. ఈ సినిమా తరువాత సౌందర్య వెనుతిరిగి చూసుకోలేదు. వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో టాప్ వన్ హీరోయిన్ గా నిలిచారు. తెలుగు స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు వంటి హీరోల సరసన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తెలుగు ఇండస్ట్రీలో హిట్ పెయిర్ గా వెంకటేష్ ,సౌందర్య అని చెప్పవచ్చు.ఆరు సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్, మూడు సార్లు నంది అవార్డ్ ని అందుకున్నారు.అమ్మోరు,అంత:పురం, పవిత్ర బంధం సినిమాలు సౌందర్యకు ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టాయి.
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న సౌందర్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినటువంటి మేనమామ జిఎస్ రఘుని వివాహం చేసుకున్నారు.సౌందర్య నటించిన చివరి చిత్రం తెలుగులో శివశంకర్ కాగా, కన్నడలో ఆప్తమిత్రలో గంగ పాత్రలో నటించారు..ఈ సినిమాలో నటనకి గాను ఫిలింఫేర్ అవార్డు రాగా సౌందర్య మరణాంతరం వచ్చిన ఈ అవార్డుని తన భర్త రఘు అందుకున్నారు