ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సాయిపల్లవి కి  ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే. ఫిదా  సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా  అడుగు పెట్టిన సాయి పల్లవి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది.  ఇక మొదటి సినిమాలోనే తెలంగాణ యాసలో తన సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పి తెలుగు ప్రేక్షకులందరికీ మరింతగా ఆకట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఫిదా సినిమా తర్వాత సాయి పల్లవి ఎక్కడా వెనక్కి తిరిగి తీసుకోలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వరుసగా  అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది సాయి పల్లవి.



 ఇకపోతే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. గ్లామర్ పాత్రలకు మాత్రం ఆమడ దూరంలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి గ్లామర్ పాత్రల్లో నటించక పోయినప్పటికీ తన చిలిపి నవ్వుతోనే ప్రేక్షకుల మనసులను కొల్లగొడుతుంది ఈ సొగసరి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైంది సాయి పల్లవి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న అయ్యప్పన్ కోషియం  సినిమాలో సాయి పల్లవి సెలెక్ట్ అయింది.



 ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలో  సాయి పల్లవివి వెండి తెరపై చూసేందుకు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ప్రస్తుతం అభిమానులకు నిరాశ ఎదురైంది అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా నుంచి సాయి పల్లవి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎందుకు తప్పుకుంది అన్న కారణాలు తెలియక పోయినప్పటికీ కొత్త హీరోయిన్ ను  వెతికే పనిలో చిత్రబృందం అయినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా నటించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: