నా పేరు సూర్య సినిమా తర్వాత అల్లు అర్జున్ కొద్దిపాటి గ్యాప్ తో త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఆ సినిమాకు అల వైకుంఠపురములో టైటిల్ ఫిక్స్ చేశారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. 


వీళ్లు సరిపోరు అన్నట్టుగా సినిమాలో మరో స్పెషల్ అప్పియరెన్స్ ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రం శ్రీనివాస్. ఆయన సినిమాల్లో కరెక్ట్ టైంకు స్పెషల్ సాంగ్ కంపల్సరీ ఉంటుంది. వేరే దర్శకుల సినిమాల్లో అది ఐటం సాంగ్ లా అనిపించినా ఆయన మాత్రం దాన్ని కథలో అవసరానికి అన్నట్టుగా ప్లాన్ చేస్తాడు. అల్లు అర్జున్ తో చేస్తున్న అల వైకుంఠపురములో కూడా అలాంటి ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడట త్రివిక్రం.  


ఈ సాంగ్ లో రకుల్, కాజల్ ఇద్దరిలో ఒకరు ఓకే అవుతారని తెలుస్తుంది. స్టార్ హీరోయిన్ గా ఉన్న కాజల్ పక్కా లోకల్ సాంగ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. కెరియర్ లో చేసిన మొదటి స్పెషల్ సాంగ్ కే మంచి గుర్తింపు రావడంతో కాజల్ అలాంటి ఛాన్సులు కూడా మిస్ అవ్వట్లేదు. ఇక మరో పక్క కాజల్ ఎలాగు స్పెషల్ సాంగ్ లో కనిపించింది కాబట్టి రకుల్ తో బన్ని స్పెషల్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట.


ఇద్దరిలో ఎవరైనా సరే ఆ సాంగ్ అదిరిపోవడం ఖాయం. తమన్ మ్యూజిక్ అందిస్తున్న అల వైకుంఠపురములో సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు పొంగల్ వార్ లో దిగుతున్నాడు. ఈ ఇద్దరితో పోటీకి తాను సిద్ధం అంటున్నాడు కళ్యాణ్ రాం. సతీష్ వేగేశ్న డైరక్షన్ లో ఎంత మంచివాడవురా సినిమాను సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: