మరో రెండు వారాల్లో విడుదల కాబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదలైంది. సైరా నరసింహారెడ్డి టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచగా సైరా ట్రైలర్ ఆ అంచనాల్ని రెట్టింపు చేసింది. మూడు నిమిషాల నిడివి గల సైరా ట్రైలర్ అద్భుతంగా ఉందని చెప్పటం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. చిరంజీవి అభిమానులే కాదు సామాన్య ప్రేక్షకులు కూడా సైరా సినిమా కోసం విపరీతంగా ఎదురుచూసేలా ట్రైలర్ అంచనాలు పెంచింది. 
 
ట్రైలర్లో యుధ్ధ సన్నివేశాలకు ఎక్కువగా మేకర్స్ ప్రాముఖ్యతనిచ్చారు. బాహుబలి సినిమా తరువాత ఆ రేంజ్ యుధ్ధ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని చెప్పవచ్చు. ట్రైలర్లోని విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా ట్రైలర్ చూస్తుంటే సైరా సినిమా కూడా బాహుబలి సినిమాలా సంచలన విజయం సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి బాగా సూటయ్యాడు. 
 
ట్రైలర్లోని  డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. అమిత్ త్రివేది నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. సినిమాలో ప్రధాన పాత్రలైన నయనతార, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి పాత్రలకు ట్రైలర్లో బాగానే ప్రాముఖ్యత ఇచ్చారు. ట్రైలర్ చివర్లో చివరి కోరికేమైనా ఉందా అని  బ్రిటిష్ వారు అడిగే ప్రశ్నకు నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి చెప్పిన గెట్ ఔట్ ఫ్రమ్ మై మదర్ లాండ్ అనే డైలాగ్ బాగుంది. 
 
అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ కానుకగా సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల కాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దాదాపు 270 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు డైలాగ్స్ అందించాడు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమాను తెరకెక్కించారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: