ఇప్పటికే ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలను చాలా దేశాలు నిషేధం విధించాయి. భారత్ కూడా అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను మరికొన్ని రోజులు పొడిగించింది. అయితే... భారత్ కూడా ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఫస్ట్ వేవ్ సమయంలో అమలు చేసినట్లుగా కఠినంగా వ్యవహారించాలని కేజ్రీవాల్ సూచించారు. సెకండ్ వేవ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని... అందుకే ప్రాణ నష్టం భారీగా ఉందన్నారు. ఇప్పటికే థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. కేంద్రంల కీలక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కొత్త వేరియంట్ వైరస్ నేపథ్యంలో... ఢిల్లీ అధికారులతో కేజ్రీవాల్ రివ్యూ నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, కోవిడ్ నిబంధనల అమలు, ప్రయాణాలపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఆలస్యం చేయడం వల్ల వైరస్ వ్యాప్తికి సహకరించిన వారు అవుతారని కేజ్రీవాల్ హెచ్చరించారు. ప్రయాణికులకు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కేజ్రీవాల్ సూచించారు.
ఇప్పటికే ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలను చాలా దేశాలు నిషేధం విధించాయి. భారత్ కూడా అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను మరికొన్ని రోజులు పొడిగించింది. అయితే... భారత్ కూడా ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఫస్ట్ వేవ్ సమయంలో అమలు చేసినట్లుగా కఠినంగా వ్యవహారించాలని కేజ్రీవాల్ సూచించారు. సెకండ్ వేవ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని... అందుకే ప్రాణ నష్టం భారీగా ఉందన్నారు. ఇప్పటికే థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. కేంద్రంల కీలక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కొత్త వేరియంట్ వైరస్ నేపథ్యంలో... ఢిల్లీ అధికారులతో కేజ్రీవాల్ రివ్యూ నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, కోవిడ్ నిబంధనల అమలు, ప్రయాణాలపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఆలస్యం చేయడం వల్ల వైరస్ వ్యాప్తికి సహకరించిన వారు అవుతారని కేజ్రీవాల్ హెచ్చరించారు. ప్రయాణికులకు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కేజ్రీవాల్ సూచించారు.