వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా సెటైర్లు వేశాడు. వడ్డింపు, వాయింపు అంటూ ఎల్లో మీడియా ఏడుపు మొదలెట్టేసింది అంటూ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''ఈఆర్‌సీ ప్రకటించిన కరెంట్‌ ఛార్జీల టారిఫ్‌ను లోతుగా పరిశీలించకుండానే వడ్డింపు, వాయింపు, బాదుడు అంటూ ఎల్లో మీడియా ఏడుపు మొదలెట్టింది. కొత్త టారిఫ్‌తో కోటీ 43 లక్షల మంది వినియోగదారులకు 60 కోట్ల వరకు భారం తగ్గుతుందన్న వాస్తవాన్ని కప్పిపెట్టి దుష్ప్రచానికి తెర తీసింది.'' అంటూ ఫైర్ అయ్యారు విజయసాయి రెడ్డి.              

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. కొందరు ఫైర్ అవుతే.. మరికొందరు వాళ్ళు అంతేలే.. నీచులు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. జగన్ అన్న ఏం చేసిన ఖచ్చితంగా దానిపై ఏదో ఒకలా దృష్ప్రచారం చేస్తారు.. మీరు పట్టించుకోకండా అంటూ ఫైర్ అయ్యారు నెటిజన్లు.. మరికొందరు మాత్రం విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు.. అయితే ఈ ట్విట్ కారణంగా వైసీపీ అభిమానులు.. టీడీపీ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది.. దీంతో ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: