ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళం నృత్యం చేస్తుండడంతో మనుష్యులు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా ఇప్పటికే 202 దేశాల్లో ఈ మహమ్మారి వైరస్ విస్తరించింది. ఇప్పటికే కరోనా బాధితులు 10 లక్షలు దాటేశారు. కరోనా మరణాలు 53 వేలకు చేరుకున్నాయి. ఇక మనదేశంలో కరోనా బాధితులు 2500కు చేరుకుంటే... మరణాలు 72 ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా రోజు రోజుకు పెరిగిపోతోంది. ఏపీలో కేసులు 149 ఉంటే... తెలంగాణలో ఇవి 154 ఉన్నాయి.
తెలంగాణలో గురువారం మరో 27 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 154కి చేరింది. ఈ మొత్తం కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు, వారి బంధువులే 86 మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. బుధవారం అర్ధరాత్రికి రాష్ట్రంలో 111 పాజిటివ్ కేసులు ఉండగా ఆ సంఖ్య గురువారానికి 149కు చేరింది. గురువారం ఒక్కరోజే 38 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ కేసుల్లో ఢిల్లీ నుంచి వచ్చిన వారివే ఎక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఢిల్లీ ప్రార్థనలే.
ప్రపంచ వ్యాప్తంగా గురువారం ఉదయం 8 గంటల అప్డేట్స్ ఇలా ఉన్నాయి...
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 10, 15, 474
మృతుల సంఖ్య - 53, 191
రికవరీ కేసుల సంఖ్య - 2, 12, 229
యాక్టివ్ కేసుల సంఖ్య - 7, 50, 054
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 2, 65, 420
వరల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు
అమెరికా - 2, 45, 066 - 6075
ఇటలీ - 1, 15, 242 - 13, 915
స్పెయిన్ - 1, 12, 065 - 10, 348
భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 2543
మృతులు - 72
తెలంగాణలో కేసులు - 154
గురువారం కేసులు - 27
తెలంగాణ మృతులు - 9
తెలంగాణలో డిశ్చార్జ్ - 17
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
ఏపీలో కేసులు - 149
హయ్యస్ట్ కేసులు ఉన్న జిల్లా - నెల్లూరు (24)
కొత్త కేసులు - 38
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple