ఆదివారం విడుదల చేసిన కరోనా బులిటెన్ వివరాల ప్రకారం… రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,00,17,126 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. వీలైనన్ని చోట్ల కరోనా వైద్య పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్ కేసులు గుర్తిస్తే వెంటనే వారికి క్వారంటైన్ లేదా ఐసొలేషన్ చేయడం, అవసరమైతే ఆస్పత్రుల్లో చికిత్స చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా వ్యవహరిస్తోంది. అందుకే తక్కువ వ్యవధిలోనే కోటి వైద్య పరీక్షల మైలు రాయిని దాటింది. రాష్ట్రంలో తొలుత కరోనా పరీక్షలకు అనువైన ల్యాబ్స్ లేకపోవడం వల్ల, ఫిబ్రవరి 1న తొలి శాంపిల్ను తెలంగాణలోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత రాష్ట్రంలో తొలి కరోనా పరీక్ష మార్చి 7న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో నిర్వహించారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.. కానీ, టెస్ట్ల సంఖ్యను భారీగానే ఉంటుంది... ఇక, ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కరోనా టెస్టులు పెద్ద సంఖ్యలో నిర్వహిస్తోంది ప్రభుత్వం... కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా టెస్ట్ ల సంఖ్య లక్షల్లోనే ఉండగా... ఏపీలో మాత్రం ఇవాళ వాటి సంఖ్య కోటి దాటేసింది... ఇవాళ ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్లో గడిచిన 24 గంటల్లో 54,710 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 620 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.