తొలి ఓవర్ నుంచి తన మాస్టర్ మైండ్ తో రాజస్థాన్ ను ఉచ్చులో బిగించాడు. ధోనీ ప్రణాళికలను అర్ధం చేసుకోలేని రాజస్థాన్ నెమ్మదిగా ఓటమి వైపు ప్రయాణించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. క్రమం తప్పకుండా వికెట్లు కొల్పోయింది. ధోనీ వ్యూహాలతో 10 ఓవర్లలోనే మ్యాచ్ రాజస్థాన్కు దూరమైంది. ఒకపక్క కావాల్సిన రన్రేట్ పెరిగిపోతుండడంతో.. ఆ జట్టుపై ఒత్తిడికి తీవ్రమైంది. ఛేదనలో పూర్తిగా వెనుకబడింది.
టాపార్డర్లో బట్లర్ (49) మినహా మిగతా ఎవరూ రాణించలేదు. బట్లర్ తర్వాత ఆ జట్టు బ్యాట్స్మెన్లంతా పెవిలియన్కు క్యూ కట్టారు. కెప్టెన్ శాంసన్ (4) నిరాశ పరిచాడు. అయితే మిడిలార్డర్లో దూబే (17), తెవాటియా (20) ఫర్వాలేదనిపించగా.. చివర్లో ఉనద్కత్ (24) ఓటమి దూరం తగ్గించగలిగాడు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులే చేయగలిగింది. చెన్నై జట్టు 45 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. చెన్నై బౌలర్లలో మొయీన్ అలీ 3, జడేజా 2 వికెట్లతో సత్తా చాటారు. వీరితోపాటు శామ్ కర్రాన్ 2, ఠాకూర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. బంతితోపాటు బ్యాటుతోనూ రాణించిన మొయీన్ అలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
కాగా.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మంచి ఓపెనింగ్ లభించింది. రుతురాజ్ గౌక్వాడ్(10) త్వరగా అవుటైనా.. ఫాఫ్ డూ ప్లెసిస్(33) బాగా ఆడాడు. ఆ తర్వాత మొయీన్ అలీ(26), రాయుడు(27), బ్రావో(20 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయినప్పటికీ 188 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు తీయగా, క్రిస్ మోరిస్ 2 వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మాన్, రాహుల్ తెవాటియా చెరో వికెట్ తీశారు.