
దీంతో తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఉన్న ఫార్వర్డ్ సర్జికల్ సెంటర్లోనే అపెండెసైటిస్ ఆపరేషన్ నిర్వహించామని అధికారులు వెల్లడించారు. ఇలాంటి ఎత్తైన ప్రదేశాల్లో వైద్యులు శస్త్ర చికిత్స చేయటం చాలా అరుదని తెలిపారు.ఫార్వర్డ్ పోస్ట్లలోని సైనికుల ఆరోగ్యం, వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. దీనితో పాటు భారత ఆర్మీ మేజర్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె పలుమార్లు అక్కడ పర్యటించారు. జవాన్ల దుస్తులు, వసతి తదితర అంశాలను సమీక్షించారు.