ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న  తీవ్ర వాయుగుండం ఏర్పడగా రాగల 12 గంటల్లో బలపడి తుఫానుగా మారనుందని అంటున్నారు.  పశ్చిమ దిశగా పయనించి రేపు సాయంత్రానికి ఉత్తరాంధ్ర (విశాఖ) - దక్షిణ ఒడిశా(గోపాల్ పూర్) మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంటున్నారు, దీని ప్రభావంతో  ఈరోజు కోస్తాంధ్ర వ్యాప్తంగా  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు , అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు, ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 -60 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, రేపు ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 70 -90 కి మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదని కూడా కమిషనర్ విపత్తుల శాఖ కన్నబాబు పేర్కొన్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.; 

మరింత సమాచారం తెలుసుకోండి: