దేశంలో దాదాపు 50 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ చేశారు.  దాంతో మందు బాబులు నానా అవస్థలు పడ్డారు.  మొన్నటి నుంచి మద్యం షాపులు తెరిచారు.  ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణలో మద్యం షాపులు తెరచిన విషయం తెలిసిందే. తాజాగా బాలానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం ఎందుకు కొన్నావని భార్య ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  వివరాల్లోకి వెళితే.. బాలానగర్‌లో నివాసముంటున్న ప్రసాద్.. ఈ రోజు  వైన్ షాపులు ఓపెన్ అవడంతో మద్యం బాటిళ్లను కొనుక్కుని ఇంటికి వెళ్లాడు. 

 

గతకొన్ని రోజుల నుంచి ఎలాంటి పనీ పాట లేకుండా ఖాళీగా కూర్చొని ఇప్పుడు మద్యం షాపులు తెరవగానే ఎలా మందు తెచ్చావని  ప్రశ్నించింది. అలా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రసాద్.. బ్లేడ్‌తో తన ఒంటిపై గాట్లు పెట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భర్త చేసిన పనికి ఒక్కసారే షాక్ తిన్న ఆయన భార్య వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లింది.  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: