విశాఖ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా కరోనా విశాఖ కమీషనరేట్ ని కూడా తాకినట్టు తెలుస్తుంది. విశాఖ సిటీ కమిషనరేట్ పరిధిలో ద్వారకా క్రైమ్ సీఐకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు.

 

ఇటీవల బదిలీలు జరగగా స్పెషల్ బ్రాంచ్ నుంచి ద్వారక క్రైమ్ విభాగానికి ఆయనను బదిలీ చేసారు. ఇటీవల జరిగిన ఒక నేర సమీక్ష సమావేశంలో సీఐ హాజరుకావడంతో పోలీసుల్లో ఇప్పుడు కరోనా భయం మొదలయింది. ఇక ఇప్పటికే విశాఖలో ఒకరు ఇద్దరు పోలీసులకు కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: