మహారాష్ట్రలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. ఇక అక్కడి పోలీస్ వ్యవస్థలో కరోనా కేసులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకి పోలీసుల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా అక్కడ మరోసారి భారీగా పోలీసుల్లో కేసులు నమోదు అయ్యాయి. 

 

గత 48 గంటల్లో, మహారాష్ట్ర పోలీసులలో ఇద్దరు కరోనాతో మరణించారు. 185 మంది పోలీసులకు కొత్తగా కరోనా సోకింది. 998 క్రియాశీల కేసులు ఉన్నాయని మహారాష్ట్ర పోలీసులు పేర్కొన్నారు. 3239 మంది పోలీసులకు కరోనా పూర్తిగా తగ్గింది అని... 51 మంది పోలీసులు కరోనాతో మరణించారు అని పోలీస్ శాఖ పేర్కొంది. ఇక మొత్తం కేసుల సంఖ్య పోలీస్ శాఖలో 4288కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: