కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయం మాజీ ముఖ్య కార్యదర్శి ఎం.శివశంకర్​ను అదుపులోకి తీసుకుంది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ). ముందస్తు బెయిల్​కు కేరళ హైకోర్టు బుధవారం నిరాకరించిన నేపథ్యంలో.. ఓ ప్రైవేటు ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను కస్టడీలోకి తీసుకుంది.బంగారం స్మగ్లింగ్​ కేసులో కస్టమ్స్​ విభాగం, ఈడీ నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్​ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఎం.శివశంకర్​​. బుధవారం విచారణ సందర్భంగా.. ఈడీ బలంగా వాదనలు వినిపించింది.


 విచారణకు సహకరించకపోవటం వల్ల కస్టడిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ కేసులో కీలకంగా ఉన్న శివశంకర్​కు బెయిల్​ ఇస్తే దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాదించింది. ఈడీ వాదనలను ఏకీభవించిన న్యాయస్థానం.. బెయిల్​కు నిరాకరించింది.యూఏఈ నుంచి వచ్చిన సరకు రవాణాలో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. యూఏఈ కాన్సులేట్​ మాజీ ఉద్యోగి అయిన సరిత్​ను జులై 5న అరెస్ట్​ చేశారు. కాన్సులేట్​ మాజీ ఉద్యోగిని స్వప్నా సురేశ్​, అతని సన్నిహితుడు సందీప్​ నాయర్​ను కూడా అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్​ఐఏ.

మరింత సమాచారం తెలుసుకోండి: