భార‌త్‌లో క‌రోనా మ‌రో రెండు కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. క‌రోనా సెకండ్ వేవ్ ఎంత తీవ్ర‌స్థాయిలో ఉందో తెలిసిందే. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా భ‌యంక‌ర‌మైన రికార్డులు క్రియేట్ చేసింది. వరుసగా రెండో రోజు పాజిటివ్ కేసులు మూడు లక్షలకుపైగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మరే దేశంలోనూ వరుసగా రెండు రోజులు మూడు లక్షల కేసులు నమోదుకాలేదు. దీంతో భారత్ మరో రికార్డును సొంతం చేసుకుంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3.32 లక్షలు కేసులు.. 2,256 మరణాలు రికార్డయ్యాయి. ఈ జోరు చూస్తుంటే ప్ర‌తి మూడు రోజుల‌కు దేశంలో మిలియ‌న్ కేసులు న‌మోదు కానున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: